Thursday, August 18, 2016

మహలక్ష్మి సినిమా దియేటర్

ఈ రైస్ మిల్ కోనసీమలో వున్న ‘’మోరి’’ గ్రామంలో వుంది.ఒకప్పుడు దీని పేరు’’మహలక్ష్మి సినిమా దియేటర్’’.ఎన్నో సూపర్ హిట్ సినేమాలాడిన ఈ దియేటర్లో రిలీజ్ అయిన మొట్ట మొదటి సినిమా నాగేశ్వర్రావు,బి.సరోజాదేవి,క్రిష్ణ కుమారీ యాక్ట్ చేసిన ‘’పెళ్లి కానుక’’....నాగేశ్వరరావు,శ్రీదేవి,సుజాతా యాక్ట్ చేసిన ‘’ప్రేమ కానుక’’ కూడా ఈ దియేటర్లోనే ఆడింది...ఎన్టీఅర్,ఏయెన్నార్ ల చాలా సూపర్ హిట్లు ఇందులో ఆడి వెళ్లి నియ్యంట.
కాలం గడుస్తుంది..మలికిపురం,రాజోలు,తాటిపాకల్లో కొత్త దియేటర్లు కట్టడంతో ఇది పాతబడి పోయింది. జనాలు రావడం మానెయ్యడంతో మూతబడి పోయింది.చాన్నాళ్ళలాగుండి పోయేక అదే పేరుతో రైస్ మిల్ గా మారిపోయిందిప్పుడు.
అసలు దీనికంటే ముందు ఇదే ఊళ్ళో పొలాల మధ్య వున్న హాలు ‘’విజయశ్రీ టూరింగ్ టాకీస్’’.. దాని మీద మిత్రుడు గోపరాజు రాధాకృష్ణ మంచి కథ రాశారు.
గొప్పగొప్ప బ్లాకండ్ వైట్ సినిమాలు ఆ హాల్లో అడినియ్యంట.అందులో ఆడిన ఆఖరి సినేమా ‘’గులేభ కావళి కథ’’.ఆ రోజుల్లో,వంద రోజులాడిందట.ఆఖరి రోజున ఆఖరి ఆటకి మూడు దియేటర్లు పట్టే జనం ఎడ్లబళ్ళు కట్టుకునొచ్చారంట ........అలా ఆ సినేమాహాలు కథలు చాలా విని, థ్రిల్ అయిపోయిన నేను, శిధిలమయిపోయిన ఆ హాలు ఫోటో తీసుకుందామని ఆ విజయశ్రీ టూరింగ్ టాకీస్ వున్న చోటి కెళితే...........................
అది ఉన్న ప్లేస్ లో ఒక గెస్ట్ హౌస్ కట్టేసుంది.
దాన్నే చూస్తా వుండి పోయిన నా మనసు అదోలాగయి పోయింది.....కాసేపు నా మాట పడి పోయింది .






No comments:

Post a Comment