Thursday, August 18, 2016

ఊరు గొడ్డుపోయింది

గోదావరి ఒడ్డున పాపికొండల వేపు వెళ్తుంటే, నాకు తెలిసిన కొన్ని గ్రామాల్లో ఈ గ్రామం కూడా ఒకటి.ఈ రేవులో సెట్ వేసి మొత్తం సినిమా ఒకటి తీశాం గతంలో. .మా దిగువ నుంచి ఈ ఎగువకి వలసొచ్చిన ఆ చేపలు పట్టే కుటుంబాల్లో కొన్ని నాకు తెలుసు.
షూటింగ్ జరిగే రోజుల్లో అప్పుడప్పుడు మంగ,శివాలు అనే ఇద్దరు ఆడాళ్ళతో పులుసులూ,ఇగుర్లు వండించే వాళ్ళం.పుల్లల పోయ్యిలమీద,మట్టి దాకల్లో వండే ఆ రుచులే వేరు.రావుడు అనే వాడు ఎప్పుడూ తాగుతూ సీమచింత చెట్టుకింద పడుకుని బొంగురు గొంతొకటేసుకుని, ఘంటసాలగారి పాటలు పాడుతుండే వాడు.మొగుడూపెళ్లాలిద్దరు ఎప్పుడూ గొడవలు పడతా వుండేవాళ్ళు.ఎప్పుడోవచ్చి ఈ ఊళ్ళో సెటిలయిన తమిళ్ కిరణాకొట్టు వాళ్ళొచ్చి పలకరించే వాళ్ళు.చెప్పుకుంటా పొతే ఇలా చాలా రకాల జనం.
ఈ ప్రాంతానికొచ్చినప్పుడల్లా ఈ ఊరొచ్చి వాళ్ళని చూసివెళ్ళేవాణ్ణి.
చాన్నాళ్ళతర్వాత రావడంతో ఓసారి పలకరించెళదామని, రేవులో పడవ దిగి, గట్టు ఫైకెక్కి, ఊళ్ళో కెళితే--------------అంతా స్మశానంలాగుంది.ఒక్క ఇల్లు లేదు ,ఒక్క మనిషి లేడు.పోలవరం ప్రాజెక్ట్ వస్తందని ఖాళీచేసిన వాళ్ళంతా,ఎక్కడెక్కడికో చెల్లా చెదురయి పోయేరంట .....ఖాళీగా వున్న ఆ ప్రదేశమంతా భోరుమని ఏడుస్తుంది.









No comments:

Post a Comment